Komatireddy Raj Gopal Reddy: నేను పార్టీ మారడం లేదు.. మునుగోడు నుండే బరిలో దిగుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Raj Gopal Reddy: బీజేపీతోనే నా ప్రయాణమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంపై ఆయన ఖండించారు. కొంతమంది ఇలాంటి పోస్టులతో క్యాడర్ ను అయోమయానికి గురిచేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే తన ప్రయాణం చేస్తాఅని పార్టీ మారే సమస్యలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతా అని స్పష్టం చేశారు.
Read also: YS Viveka Case: మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్రెడ్డి.. విచారణపై ఉత్కంఠ.. ఏం జరుగుతోంది..?
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క్లియర్ మెజార్టీతో అధికారం హస్తగతం చేసుకుంది. మెుత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. 136 సీట్లను కైవసం చేసుకుంది. మెున్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 65 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కింగ్ మేకర్ రోల్ పోషించాలనుకున్న జేడీఎస్ గత ఎన్నికలతో పోలిస్తే.. తక్కువ సీట్లకు పరిమితమైంది. ఈసారి ఆ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కర్ణాటకలో అనూహ్యమైన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో టీ కాంగ్రెస్ సభ్యత్వం కూడా పెరగనుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరుతాయనే వార్తలు సంచలనంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి అడుగుపెడతారనే వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ స్పందించారు. బీజేపీ పార్టీని వదిలే సమస్యేలేదని క్లారిటీ ఇచ్చారు. మునుగోడు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేయండంతో వ్యవహారం కాస్త సద్దుమణిగింది.
YSR Matsyakara Bharosa Scheme: గుడ్న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు
తాజావార్తలు
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
-
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..