Komaram Bheem: నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..
- కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు..
- శైలజ మృతికి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణమని ఆగ్రహం..
- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలంటూ బంద్ కు పిలుపు..
- నేడు వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలే ఏం జరిగిందంటే..
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి.శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్లో మృతిచెందింది. శైలజ వాంకిడి గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థిని. అక్టోబర్ 31న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో రాత్రి భోజనం చేసి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన 63 మందిలో శైలజ ఒకరు. తీవ్ర అస్వస్థత కారణంగా శైలజతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినప్పటికీ ముగ్గురు విద్యార్థులు కోలుకోకపోవడంతో, నవంబర్ 5న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హైదరాబాద్కు తరలించారు. శైలజ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అనేక సార్లు అతిసారంతో బాధపడింది.
అయితే శైలజతో వున్న మిగతా ఇద్దరు విద్యార్థినులు కోలుకోగా.. శైలజ పరిస్థితి విషమంగానే ఉండటం కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ నవంబర్ 5 నుంచి నవంబర్ 9 వరకు డయాలసిస్, వెంటిలేటర్ సపోర్టుపైనే ఉండాల్సి వచ్చింది. నవంబర్ 11న, సోమవారం మరణించే వరకు ఆమెకు వెంటిలేటర్పై ఉంచారు. శైలజ మృతదేహాన్ని తల్లిదండ్రులు మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలోని స్వగ్రామంలో ఉద్రికత్తల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇవాళ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కొమురం భీం జిల్లాలోకి అనుమతించడం లేదు. ఎక్కడ చూసి పోలీసులు భారీగా మోహరించారు.
Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరనేది నేడు తేలనుంది..?
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!