Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరనేది నేడు తేలనుంది..?
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ప్రధాని మోడీ, అమిత్ షాలతో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ భేటీ..
- మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ ఈరోజు ఉదయం వీడే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఏక్నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లతో కలిసి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తన రిజైన్ లేటర్ సమర్పించారు. ఇక, కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని మహారాష్ట్ర గవర్నర్ కోరారు. ఇందుకు షిండే ఒప్పుకున్నారు. కాగా, ఈ నెల 23న వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
Read Also: Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అయితే, దేవేంద్ర ఫడ్నవీస్కు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకులూ డిమాండ్ చేస్తుండగా మరోసారి ఏక్నాథ్ షిండేకే అవకాశం ఇవ్వాలని.. బిహార్ మోడల్ అమలు చేయాలని శివసేన (షిండే) వర్గం నేతలు కోరుతున్నారు. ఇక, ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Read Also: RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
ఇక, ఈ ముగ్గురు నాయకులే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలుస్తారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది తేల్చడంపై తొందరపడబోమని భారతీయ జనతా పార్టీ నేత ఒకరు చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు లేకుండా అన్ని నిర్ణయాలు పూర్తి చేసుకుంటామన్నారు. అలాగే, ఫడ్నవీస్కే సీఎంగా ఛాన్స్ ఇవ్వాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు ఏక్నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించాలని సూచించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!