Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరనేది నేడు తేలనుంది..?
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ప్రధాని మోడీ, అమిత్ షాలతో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ భేటీ..
- మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ ఈరోజు ఉదయం వీడే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఏక్నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లతో కలిసి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తన రిజైన్ లేటర్ సమర్పించారు. ఇక, కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని మహారాష్ట్ర గవర్నర్ కోరారు. ఇందుకు షిండే ఒప్పుకున్నారు. కాగా, ఈ నెల 23న వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
Read Also: Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం
Also Read
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
అయితే, దేవేంద్ర ఫడ్నవీస్కు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకులూ డిమాండ్ చేస్తుండగా మరోసారి ఏక్నాథ్ షిండేకే అవకాశం ఇవ్వాలని.. బిహార్ మోడల్ అమలు చేయాలని శివసేన (షిండే) వర్గం నేతలు కోరుతున్నారు. ఇక, ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Read Also: RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
ఇక, ఈ ముగ్గురు నాయకులే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలుస్తారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది తేల్చడంపై తొందరపడబోమని భారతీయ జనతా పార్టీ నేత ఒకరు చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు లేకుండా అన్ని నిర్ణయాలు పూర్తి చేసుకుంటామన్నారు. అలాగే, ఫడ్నవీస్కే సీఎంగా ఛాన్స్ ఇవ్వాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు ఏక్నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించాలని సూచించారు.
తాజావార్తలు
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!