Hyderabad: హోంవర్క్ చేయలేదని పలకతో తలపై కొట్టిన టీచర్.. యూకేజీ చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హోం వర్క్ చేయలేదని టీచర్ తలపై స్లేట్ తో కొట్టడంతో తీవ్ర గాయమై ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. హేమంత్ (5) హైదరాబాద్ రామంతాపూర్ వివేకనగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన హేమంత్ హోంవర్క్ చేయలేదని తలపై బోర్డుతో కొట్టింది. దీంతో ఆ చిన్నారి బాలుడు ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. భయభ్రాంతులైన యాజమాన్యం వెంటనే
ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడు అస్వస్థత స్థితిలో ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. యాజమాన్యం అసలు విషయం చెప్పడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్లపై నమ్మకంతో పాఠశాలకు పిల్లలను పంపిస్తే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి టీచర్లను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లే హత్య చేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు, కాలనీ వాసులు బాలుడి మృతదేహంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వనపర్తికి తరలించారు.
Read also: Astrology: అక్టోబర్ 03, మంగళవారం దినఫలాలు
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
మరోవైపు నవీపేట్ మండల కేంద్రానికి చెందిన గూడూరు రాజశేఖర్ తన కూతురు రుషిత(4)తో కలిసి సోమవారం ఉదయం స్థానిక ఎన్ మార్ట్ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. రాజశేఖర్ మాల్లో వస్తువులు కొంటుండగా, రిషిత చాక్లెట్లు తెచ్చుకునేందుకు ఫ్రిజ్ డోర్ తెరవడానికి వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారికి విద్యుత్ షాక్ తగిలింది. షాపింగ్లో బిజీగా ఉన్న తండ్రి ఈ విషయాన్ని గమనించకపోవడంతో చిన్నారి కొన్ని సెకన్ల పాటు ఫ్రిజ్పై వేలాడదీశాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారిని గమనించిన తండ్రి రాజశేఖర్ వెంటనే చిన్నారిని ఎత్తుకుని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫ్రిజ్లో సాంకేతిక లోపం తలెత్తినా మాల్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో.. ఫ్రిజ్కు విద్యుత్ సరఫరా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!