Kidnap Case: సికింద్రాబాద్ లో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం.. పరారీలో కిడ్నాపర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap Case: సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయినా బాలుడు కథ సుఖాంతంగా మారింది. కిడ్నాప్ అయిన బాలుడ్ని చాకచక్యంగా కాపాడి, తండ్రి వద్దకు చేర్చారు పోలీసులు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని ఉన్నట్లు గమనించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులను గమనించిన కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలను కిడ్నాప్ చేసారు? అని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలుడు కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆచూకి తెలుసుకున్నారు. బాలుడిని సురక్షితంగా కాపాడి తండ్రికి అప్పగించారు. పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. పిల్లల ప్రతి కదలికలను కనిపెడుతూ ఉండాలని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. రెప్పవాలితే కిడ్నాపర్లు పిల్లలపై పంజా విసురుతున్నారని, అలర్ట్ గా ఉండాలని కోరారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలాపురానికి చెందిన దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడు శివ సాయితో కలిసి తిరుమలకు వెళ్లాడు. ఈ నెల 28న తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. ఆ రోజు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేష్ అలసిపోయి స్టేషన్లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో 1వ నంబర్ ప్లాట్ఫారమ్లో బ్యాగులతో పాటు కుమారుడిని వదిలి వాష్రూమ్కు వెళ్లాడు దుర్గేష్. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. కంగారు పడిన దుర్గేష్ స్టేషన్లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. కానీ బాలుడి మానసిక పరిస్థితి బాగా లేదని దుర్గేష్ చెప్పాడు. అయితే రైల్వే స్టేషన్లో దుర్గేష్, అతని కుమారుడి కదలికలను గమనించిన వ్యక్తులే ఈ కిడ్నాప్కు పాల్పడి ఉంటారని, బాలుడి కిడ్నాప్ వెనుక మరాఠా బెగ్గింగ్ మాఫియా హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ఓ వక్తి కిడ్నాప్ చేసాడు. కిడ్నాప్ అయిన బాలుడు 5 ఏళ్ల అయాన్ ను గా గుర్తించారు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడుని గుర్తుతెలియని వ్యక్తి తీసుకోని వెళ్తునట్టు సీసీ ఫోటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఫలక్ నుమా ఫలక్నుమా పోలీస్ లకు తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ కోసం ఐదు బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు.
Minister KTR: స్కామ్ల వారసత్వంతో కాంగ్రెస్ స్కాంగ్రెస్గా మారిపోయింది
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?