Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. ప్రతి పక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్
- ప్రతిపక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్..
- ఇవ్వాళ హరీష్ రావు పర్యటననే ఓ జోక్..
- పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు.. దమ్ముంటే నాతో రా....కలిసి నడుద్దాం..
- ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని హాట్ కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి పక్షాలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్ నేడు మీసాలు తిప్పుతున్నాడని అన్నారు. రైతులకు భేడీలు వేసిన వాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారని తెలిపారు. దుష్టశక్తులు ఏవో మాట్లాడుతున్నారని అన్నారు. కార్తీక మాసంలో అపశకుణం మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని వారు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు.
Read also: Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
పోలీసులు లేకుండా జనాల్లోకి వచ్చినా మొహాలామీవి అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. కోయిన్ని వెంకన్నను అడిగితే మీ పాపాలు బయట పడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండి…. స్వీకరిస్తాం అన్నారు. రాష్ట్రం లో ఒక మాట దేశంలో ఒక మాట అంటూ మండిపడ్డారు. బిడ్డను జైల్ నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్నారు. రేవంత్ పాలన భేష్ అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు.
Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
ఇవాళ హరీష్ రావు పర్యటననే ఓ జోక్ అన్నారు. నాగలి పట్టి దున్నిన మోహలా మీవి అన్నారు. మీ బ్రతుకులు కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అని తెలిపారు. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారన్నారు. బీడీలు వేసిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను నానా హింసలు పెట్టింది మీరే అని మండిపడ్డారు. ఓడిపోయి ఏమి చేయాలో తెలియక ఇలాంటి జోకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర హారాలు మని రేవంత్ పని చేస్తున్నారని తెలిపారు. మీకు ఆత్మగౌరవం ఉందా? అని మండిపడ్డారు. మీకు రాష్ట్ర ప్రయోజనాల మీద కమిట్మెంట్ ఉందా అన్నారు. మీ రాజ్యసభ సభ్యులు ఏ స్కీం తెచ్చారన్నారు.
Read also: RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నాతో రా….కలిసి నడుద్దాం అన్నారు. నేను తిరిగిన ఊళ్ళు నీవు తిరిగావా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు మోపిన భారాన్ని మీరు, మనం కట్టలిసినా పరిస్థితి అన్నారు. నెల కాగానే జీతాలు ఇస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలతో సుజాతనగర్ లో రైతులు ఇబ్బందులు పడితే రైతుకు 6500 ఇప్పించానని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. కొత్తగూడెంలో ఫ్రీ కండిషన్ ఎయిర్ పోర్ట్ రానుందన్నారు. ఆ రోజుల్లోనే కార్గో ప్లెయిన్ కూడా అడిగా అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో అడవి అనేది లేకుండా పోయిందన్నారు. వైరాలో రైతులకు పంటల పై అవగాహన కోసం హాస్టల్ కట్టించాలని అనుకున్నామన్నారు. కొత్తగూడెం రైల్వే భూములను మనం తీసుకొని వాళ్లకు వేరే భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
ఖమ్మంను మర్చిపోనే పోను..నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను.ఆ బిరుదు అది శాసిత్వం అన్నారు. వచ్చే ఏడాది స్తంభాద్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. మత్స్యకారుల పండుగ రోజున పాలేరులో ఉత్సవాలు జరుపబోతున్నాం అన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ మంత్రిని కోరింది అన్నారు. కేటీపీఎస్ లో ఓ స్టేజి వచ్చిందంటే నా కృషి ఉంది అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పాల్వంచ స్పాంజ్ ఐరన్ ను మూసి వేసిందన్నారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్ళీ తెరిపించాలని పోరాటం చేస్తాం అన్నారు. కేటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం మొత్తం డొల్ల అంటే మీరు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమే అన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధి కోసం అన్నారు.
Manish Sisodia: లిక్కర్ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!