Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
- కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ సీఎంవో నోట్ విడుదల..
- తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..
- ఏడాది పొడవునా జాబ్ మేళా..
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం..
- దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CMO: కాంగ్రెస్ ప్రజా పాలనపై తెలంగాణ సీఎంవో నోట్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసిందని పేర్కొంది. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగిందని, తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించిందని తెలిపింది.
తెలంగాణ సీఎంవో నోట్..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
* ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసిందని పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
* గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది.అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించిందని తెలిపింది.
* పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయో పరిమితిని సడలించింది.
* గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండింగ్ లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది.
* దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
* బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే… కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది.
* జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 10006 మంది ఉద్యోగాల్లో చేరారు.
Read also: RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
* రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.
* పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
* షెడ్యూలు ప్రకారం నవంబర్ లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
* టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు.
* గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 8143 మంది ఎంపికైన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది.
* పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.
* మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వర్యంలో 7094 మంది స్టాఫ్ నర్స్ ల నియామకాలు విజయవంతంగా పూర్తి చేసింది. వీరిలో 6956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది.
* ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నిషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 5378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని నోట్ లో పేర్కొంది.
Naga Chaitanya : నాగచైతన్య నెక్ట్స్ మూవీ బడ్జెట్ అంతనా.. నోరెళ్ల బెడుతున్న ఫ్యాన్స్
తాజావార్తలు
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!