RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
- ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం..
- 600 మంది నుండి సుమారు రూ. 150 కోట్లు వసూలు..
- బషీర్ బాగ్ సీసీఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం సుమారు 600 మంది నుండి 150 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. బాధితులు అందరూ బషీర్ బాగ్ పోలీస్టేషన్ క్యూ కట్టారు. పోలీస్టేషన్ ముందు ఆర్జే బాధితులు అంటూ బ్యానెర్ తో ఆందోళనకు దిగారు. దీంతో బషీర్ బాగ్ పోలీస్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్, ఘట్కేసర్ , పటాన్ చెరువు, కర్తను ప్రాంతాలలో అపార్ట్మెంట్ , ఫార్మ్ ల్యాండ్ పేరిట ప్రముఖులతో ఆర్జే వెంచర్స్ ప్రకటనలు చేశారు. దీంతో 2020 లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టామని బాధితులు లబోదిబో మన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు.
Read also: Adilabad: మహారాష్ట్రకు మగ పులి.. మరి ఆడ పులి ఎక్కడ?
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టామని వాపోయారు. తాము ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు ఎండీని నిలదీశామన్నారు. దీంతో ఎండీ భాస్కర్ చెక్కులు ఇచ్చారని తెలిపారు. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారన్నారు.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జే వెంచర్స్ 600 మందికి మోసం చేసిందని వాపోయారు. లక్షల్లో మోసపోయామని వెంటనే తమ డబ్బును ఆర్జే వెంచర్స్ ద్వారా ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. అప్పులు చేసి ఆర్జే వెంచర్స్ పై డబ్బులు కట్టామని, వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం పారిపోకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
-
Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
-
Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!