Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
- నల్లగొండ జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్..
- సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి..
- రాహుల్ గాందీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం..
- గత ప్రభుత్వ అసమర్ధత, అవినీతి వల్ల 50 వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడింది..
- ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. నల్లగొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహాకులను మంత్రులు ప్రశంసించారు. అనంతరం జిల్లా కేంద్రంలో దిశ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి ఎంపీలు, ఎంఎల్ఏలు, అధికారులు హాజరయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాహుల్ గాందీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు.
గత ప్రభుత్వ అసమర్ధత, అవినీతి వల్ల 50 వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా పని చెయ్యాలన్నారు. సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదని తెలిపారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు. అధికారం కోల్పోయి కొంతమంది.. అధికారం కోసం కొంతమంది రైతులను ఇబ్బదలకు కూడా చేస్తున్నారని తెలిపారు. అధికారుల దయ వల్ల వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వం వైపు నుండి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు.
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం..
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!