Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti : ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
Also Read : Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
45 రోజుల క్రితం వరితో పాటు మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం జరిగింది.. ఖమ్మం జిల్లా పర్యటనలో కేసిఆర్ పర్యటించి నష్టపోయిన రైతులకు పది వేలు రూపాయలు తక్షణమే రిలీజ్ చేస్తానని చెప్పారు.. 45 రోజులు గడుస్తున్న ఆ డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తక్షణమే అంటే కేసిఆర్ దృష్టిలో 6 నెలల నుంచి 9నెలల,లేకపోతే సంవత్సరంమా అంటూ ఆయన ప్రశ్నించారు.
Also Read : Bhatti Vikramarka : తెలంగాణ మోడల్ అంటే ఇదేనా..?
తక్షణం అనే పదానికి కేసిఆరే డేపినేషన్ చెప్పాలి అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి తరలించి 15 రోజులు అవుతుంది.. ఆకాల వర్షాలతో కల్లల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైయి కొట్టుకుపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుంది.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే లోపు కల్లల్లో ఉన్న ధాన్యం వాన దేవుడి రూపంలో భూమి పాలు అవుతుంది అని పొంగులేటి ఆరోపించారు.
Also Read : Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..
ఈ ప్రభుత్వం మాటాలకే పరిమితం తప్పా…చేతల రూపం దాల్చకపోవటం బాధకరంగా ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల గోస, బాధ, ఆవేదన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని ఆయన అన్నారు. తక్షణమే పార్టీలకు అతీతంగా రైతు పండించిన పంటను యుద్ద ప్రతిపాదనగా కొనుగోలు చెయ్యాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాలవర్షం, వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులకు 20 వేల రూపాయల నష్ట పరిహారం తక్షణమే రిలీజ్ చెయ్యాలి.. కళ్ళబొల్లి కబుర్లు కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!