Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
Harbhajan Singh Neeraj Chopra Sania Mirza Supports Wrestlers Protest: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటే.. రెజ్లర్లు గత ఆరు రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో.. భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్తో పాటు ఇతర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. వీరికి క్రీడాకారుల నుంచి విస్తృతస్థాయిలో మద్దతు లభిస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ వారికి సపోర్ట్గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చిన రెజ్లర్లు.. ఇలా రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని అన్నాడు. ‘‘సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్లు భారతదేశానికి గర్వకారణం. అలాంటి రెజర్లు దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు.. ఓ క్రీడాకారుడిగా నేను బాధపడుతున్నాను. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు.
Ravichandran Ashwin: అశ్విన్ అరుదైన ఘనత.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం
Also Read
- Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
- MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
హర్భజన్తో పాటు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించాడు. న్యాయం కోసం రెజ్లర్లు వీధుల్లో ధర్నా చేయడం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన నీరజ్.. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించి, నిర్ణయం తీసుకోవాలని కోరాడు. ‘‘దేశం తరఫున పోటీ పడేందుకు మన అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. వాళ్లు దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రెజ్లర్లు.. న్యాయం కోసం వీధుల్లోకి రావడం కలచివేస్తోంది. ప్రతి పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీనిని పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరిష్కరించాలి. అధికారులు తక్షణమే స్పందించి, అథ్లెట్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరాడు. సానియా మీర్జా సైతం.. దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిన రెజ్లర్లకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని, వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సపోర్ట్గా నిలిచింది.
PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో