CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
- అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
- మా తండా వాసులు అందరికీ అశ్విని గొప్ప ఆదర్శం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా లో వరద ప్రవాహంలో కొట్టుకపోయిన తండ్రి, కూతురు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రోడ్డు మార్గాన డోర్నకల్ , కురవి మీదుగా పురుషోత్తయగూడెంకు చేరుకున్నారు. పురుషోత్తం గూడెం దగ్గర వరద ప్రభావంలో కొట్టుకపోయిన NH 365 జాతీయ రహదారి పరిశీలించారు. రహదారి పక్కన వరదతో జలమయం అయినా సీతారాం తండా వాసులకు భరోసా ఇచ్చారు. సీతారాంపురం తండాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారని తెలిపారు. అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించా అన్నారు. అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరం అన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
Read also: Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..
Also Read
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను, అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా అన్నారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మా తండా వాసులు అందరికీ అశ్విని గొప్ప ఆదర్శం అన్నారు. మా పిల్లలకి చెప్తుంటాం.. ఆశ్వికి అక్క లా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. తండాకి వస్తే అందరినీ ఆప్యాయంగా పలకరించేది. కొంచం కూడా గర్వానికి పోయేది కాదన్నారు. గొప్ప వ్యక్తిని మా తండా కోల్పోయిందని సీఎం అన్నారు.
Terrible incident: మేడ్చల్లో దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!