CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
- అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
- మా తండా వాసులు అందరికీ అశ్విని గొప్ప ఆదర్శం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా లో వరద ప్రవాహంలో కొట్టుకపోయిన తండ్రి, కూతురు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రోడ్డు మార్గాన డోర్నకల్ , కురవి మీదుగా పురుషోత్తయగూడెంకు చేరుకున్నారు. పురుషోత్తం గూడెం దగ్గర వరద ప్రభావంలో కొట్టుకపోయిన NH 365 జాతీయ రహదారి పరిశీలించారు. రహదారి పక్కన వరదతో జలమయం అయినా సీతారాం తండా వాసులకు భరోసా ఇచ్చారు. సీతారాంపురం తండాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారని తెలిపారు. అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించా అన్నారు. అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరం అన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
Read also: Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను, అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా అన్నారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మా తండా వాసులు అందరికీ అశ్విని గొప్ప ఆదర్శం అన్నారు. మా పిల్లలకి చెప్తుంటాం.. ఆశ్వికి అక్క లా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. తండాకి వస్తే అందరినీ ఆప్యాయంగా పలకరించేది. కొంచం కూడా గర్వానికి పోయేది కాదన్నారు. గొప్ప వ్యక్తిని మా తండా కోల్పోయిందని సీఎం అన్నారు.
Terrible incident: మేడ్చల్లో దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..
తాజావార్తలు
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?