Terrible incident: మేడ్చల్లో దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..
- పసికందును ముళ్ల పొదల్లో వదిలేసిన తల్లిదండ్రులు..
- మేడ్చల్ మండలం గౌదవెల్లిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: అప్పుడే పుట్టిన ఆడ శిశువును కన్న తల్లి కనికరం లేకుండా కర్కశంగా చెట్ల పొదల్లో పడేసింది. శిశువు ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ పొదల మధ్య ఉన్న శిశువును చూసి స్థానికులకు తెలుపగా రక్తపు మడుగులో అల్లాడుతున్న శిశువును కాపాడి తిరిగి తల్లి ఒడిలోకి చేర్చారు. ఈ ఘటన గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Mohammed Shami: తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన మరోసారి రాకుండా చేశా: షమీ
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
ఛత్తీస్గఢ్ విజయ పూర్ కు చెందిన తులసి, సంతోష్ దంపతులు ఆరేళ్లుగా గౌడవెల్లి గ్రామ సమీపంలోని స్టార్ పౌల్ట్రీ ఫామ్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. తులసి గర్భిణి కావడంతో భర్త సంతోష్ వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను సోమవారం మేడ్చల్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చాడు. తిరిగి పౌల్ట్రీఫామ్ కు వెళ్తుండగా తులసికి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో మార్గమధ్యలోనే ఆడ శిశువును జన్మనిచ్చింది. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో శిశువును ఓ కాగితంలో చుట్టి, రోడ్డుపక్కన ఉన్న ముళ్ల పొదల్లో వదిలేసి, అక్కడి నుంచి భర్తతో కలిసి పౌల్ట్రీఫామ్ కు వెళ్లిపోయింది. అయితే.. గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద అటు వైపు వెళుతున్న ఆటోడ్రైవర్ కు శిశువు ఏడుపు చప్పుడు వినబడింది. దీంతో ఆ వ్యక్తి స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు గ్రామ కార్యదర్శి మహిపాల్ రెడ్డికి విషయాన్ని తెలిపారు.
Read also: Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం
దీంతో కార్యదర్శి సిబ్బందితో ముళ్ల పొదల వద్దకు చేరుకుని గాలించగా.. పొదల మధ్య రక్తపు మడుగులో శిశువు రోదిస్తూ కనబడింది. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్ లక్ష్మిని రప్పించి, శిశువును పొదల నుంచి బయటకి తీశారు. అప్పటికే శిశువుకు ముళ్లు గుచ్చుకు పోవడంతో పాటు చీమలు పట్టి గాయాలయ్యాయి. వెంటనే శిశువును ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం తల్లిదండ్రుల గూర్చి ఆరాతీయగా అక్కడే ఉన్న ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తులు శిశువును కనిపారేసిన వారి వివరాలు చెప్పడంతో కార్యదర్శి పౌల్ట్రీఫామ్ వద్దకు వెళ్లాడు. తులసి, ఆమె భర్తను నిలదీశారు. దీంతో వారు శిశువు తమదేనని ఒప్పుకోవడంతో తులసిని బిడ్డతో పాటు మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఆమె భర్త సంతోష్ నీ మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. కాగా తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందనుకుని కాగితంలో చుట్టేసి పొదల్లో వదిలేశానని, అయితే శిశువు బతికుందని అధికారులు తెలపడంతో నేనే పెంచుకుంటానని తులసి తెలిపింది.
Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్…
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!