Deputy CM Bhatti: కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ అన్నారు..
- విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే..
- మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా.. ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం..
- కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ అన్నారు: డిప్యూటీ సీఎం భట్టి
Deputy CM Bhatti: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.. 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా కోతలు లేకుండా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పాలన.. 2050 నాటికి గాలి, సోలార్, నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్ల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. 29 లక్షల పంపు సెట్లకు ఇచ్చే కరెంట్ కు రూ.12,500 కోట్లు రైతుల పక్షాన కడుతున్నాం.. మహిళల అభివృద్దే, రాష్ట్ర అభివృద్ధి అని ముందుకు సాగుతున్నాం.. మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.
Read Also: Bandla Ganesh: దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో బండ్ల గణేష్ సంచలన ట్వీట్
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
ఇక, 22 వేల కోట్ల రూపాయలతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లలో గిరిజనుల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. సాగు చేసుకుంటుంటే ఆడవాళ్ళు అని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు.. మా ప్రభుత్వంలో ఇందిరా సౌరగిరి జలవికాస పథకం అమలు చేస్తున్నాం.. అడవీని రక్షిస్తూనే.. అడవి బిడ్డల ఆత్మగౌరంగా బతికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉంచిన రూ. 8వేల కోట్ల బకాయిలు తీర్చాం.. దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడెలా అవుతారు? అని అడిగారు. ప్రజలను వేధించే దెయ్యాలను తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచేస్తామన్నారు. ప్రజల పక్షమే, మా పాలన లక్ష్యం.. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రతి ప్రాజెక్ట్ కాంగ్రెస్ కట్టిందే.. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.. ప్రాధాన్యతగా ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిత్యం పర్యవేక్షిస్తూ.. అవసరమైన చోట భూసేకరణకు నిధులు విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?