KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు
- “చిల్లర ప్రభుత్వం” అంటూ ఘాటు వ్యాఖ్యలు
- పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకపోవడంపై ఆవేదన
- రైతులు, అంబేద్కర్ విగ్రహం అంశాలపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం ‘బొందలో పడ్డట్టు’ అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వాడుతున్న భాషను తప్పుబడుతూ, ఇది ఒక “చిల్లర ప్రభుత్వం” అని ఆయన సంబోధించారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే సభలో రణరంగం సృష్టించేవాళ్లమని, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే గేట్లు కూడా తీయకుండా అవమానించారని, తాము పోరాటం చేసిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితిపై స్పందిస్తూ.. ధాన్యం కొనడం చేతకాక రైతులను గోస పెడుతున్నారని, రైతు బంధు వంటి గొప్ప పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను పడ్డ కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రతిపాదించినా తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టి సాధించానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం తాము పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి కూతలకు భయపడేది లేదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!