KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు
- “చిల్లర ప్రభుత్వం” అంటూ ఘాటు వ్యాఖ్యలు
- పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకపోవడంపై ఆవేదన
- రైతులు, అంబేద్కర్ విగ్రహం అంశాలపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం ‘బొందలో పడ్డట్టు’ అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వాడుతున్న భాషను తప్పుబడుతూ, ఇది ఒక “చిల్లర ప్రభుత్వం” అని ఆయన సంబోధించారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే సభలో రణరంగం సృష్టించేవాళ్లమని, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే గేట్లు కూడా తీయకుండా అవమానించారని, తాము పోరాటం చేసిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితిపై స్పందిస్తూ.. ధాన్యం కొనడం చేతకాక రైతులను గోస పెడుతున్నారని, రైతు బంధు వంటి గొప్ప పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను పడ్డ కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రతిపాదించినా తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టి సాధించానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం తాము పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి కూతలకు భయపడేది లేదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!