KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
- ‘నేను అసెంబ్లీకి రావాలా?’
- రేవంత్పై కేసీఆర్ తీవ్ర విమర్శలు
- ‘తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్’
- లక్ష మందితో ప్రాజెక్టుల సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రవల్లిలోని తన నివాసంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన తీరుపై మండిపడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని, శాసనసభ వేదికగా ప్రతిపక్షాలను ఆహ్వానిస్తున్న తీరును ఎండగట్టారు.
నేను అసెంబ్లీకి రావాలా? వద్దా?: ఎమ్మెల్యేలను అడిగిన కేసీఆర్
శాసనసభ సమావేశాల సందర్భంలో అధికార పార్టీ నడుచుకుంటున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని, అటువంటి బూతుల వీరుడు అసెంబ్లీకి చర్చకు రమ్మని పిలవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అసభ్యకరంగా మాట్లాడే వారితో చర్చించేందుకు తాను శాసనసభకు రావడం అవసరమా అని పరోక్షంగా ప్రశ్నించారు. “నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి” అని సమావేశంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆయన నేరుగా అడిగారు.
Also Read
- Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
- KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
- Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
నా చావు కోరుతూ ప్రసంగాలు ఇస్తున్నారు
కాంగ్రెస్ నాయకులు రాజకీయం కోసం దిగజారి మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. పదేపదే తన చావును కోరుకుంటూ ప్రసంగాలు ఇస్తున్నారని, మరొకవైపు తాము అసెంబ్లీకి రావాలంటూ ధర్నాలు చేయడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది థర్డ్ క్లాస్ పాలన అని అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడా ప్రగతి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ‘తెలంగాణ రైజింగ్’ కాదని, ‘తెలంగాణ ఫాలింగ్’ ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
లక్ష మందితో ప్రాజెక్టుల సందర్శన
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిపై ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల వద్దకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రాజెక్టుల వద్దకే నేరుగా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, నీటి పారుదల రంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్లిఫ్ట్లో అదిరిపోయే మార్పులు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!