Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- డ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారు? ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. టూరిజం మీద చర్చ కాదు..లగచర్ల బాధితుల మీద చర్చ పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారని మండిపడ్డారు. వాళ్ళు ఏమి తప్పు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదానీ కోసం భూములు గుంజుకుంటున్నారన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు.
Read also: KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
Also Read
- H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
హరి నాయక్ కు ఏమైనా అయితే ఎవరు బాధ్యులన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వాహనంలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. సభలో లగచర్ల రైతుల మీద చర్చ చేయాలని డిమాండ్ చేశారు. టూరిజం మీద చర్చ ఏముంది కేవలం డిల్లీ, జైల్ టూరిజం మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. పదుల సార్లు సీఎం డిల్లీకి వెళ్ళారు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదన్నారు. టెర్రరిజం నడిపినట్టు రాష్ట్రంలో పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల మీద చర్చ చేయాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని జనాలు కోరుకుంటున్నారన్నారు. 2027 లో ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తు ఓడగొడుతారన్నారు.
Telangana Assembly Live 2024: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!