Bandi Sanjay: కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్.. కేసీఆర్ అలా ఏమీ చేయలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vamika Birthday: వామికా పుట్టిన రోజు.. వైరల్గా మారిన కోహ్లీ, అనుష్క వీడియో!
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
అనంతరం.. తీగల గుట్టపల్లి వద్ద రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం లేదంటూ నీళ్లు నమిలారు. మరోవైపు.. భూసేకరణ సమస్యను ప్రస్తావించిన ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని బండి సంజయ్ నిలదీశారు. భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఆర్వోబీ పనులు జరుగుతున్న చోట రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు చేయాలని ఆదేశించారు.
Read Also: Mahesh Babu : మహేష్ బాబు ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో గెలిచాడో తెలుసా?
మరోవైపు.. ఇక్కడకు ఆర్వోబీ కాంట్రాక్టర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నా.. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం చేశారు. నిర్ణీత వ్యవధిలో ఆర్వోబీ పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నాసిరకం పనులు చేస్తే కాంట్రాక్టర్ ను వదిలేపెట్టే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. పనుల విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనని వెల్లడించారు. ఆర్వోబీ నిధులన్నీ కేంద్రానివేననే సంగతిని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చెప్పారు.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- counter
- kcr
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!