Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- బాధిత కుటుంబానికి పరామర్శ
- రాహుల్ అరెస్ట్పై తీవ్ర నిరసన
- సోనమ్ వాంగ్చుక్ అంశంపై స్పందన
- కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలన్న విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajgopal Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. కొద్దిరోజుల క్రితం మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జాతీయ పరిణామాలపై తీవ్ర నిరసన
బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, జాతీయ రాజకీయ పరిణామాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్ను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే లడఖ్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడి మార్గదర్శనం చేయాల్సిన ప్రభుత్వాలే, వారిపై లాఠీలతో దాడికి దిగడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి
అనంతరం పార్టీ అంతర్గత వ్యవహారాలు , కార్యకర్తల సంక్షేమంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ను గద్దె దించాలనే ఆకాంక్షతో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చాక గెలిపించిన సొంత కార్యకర్తలపైనే కేసులు పెట్టడం అత్యంత బాధాకరమని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఒకలా, మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మరొకలా చూడకూడదని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న పాత కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఏఐసీసీ ఇన్ఛార్జ్ , పీసీసీ అధ్యక్షులు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!