CM Revanth Reddy : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ, మండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ
- రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా
- కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామన్న రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామన్న సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తాము,” అని తెలిపారు. ఆయన స్పష్టం చేస్తూ, “ఈ నివేదిక ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదు. ప్రజాహిత దృష్టితోనే ఈ చర్యలు చేపడుతున్నాం,” అన్నారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
Donald Trump: భారత్కు పిడుగులాంటి వార్త! టారిఫ్లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నివేదికపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేయలేదు. ఇది స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక,” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తీరుతెన్నులు ప్రజాధన దుర్వినియోగానికి దారితీశాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం, సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, కమిషన్ సూచనల అమలుకు తగిన చర్యలు చేపట్టనుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!