CM Revanth Reddy : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ, మండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ
- రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా
- కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామన్న రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామన్న సీఎం.
CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తాము,” అని తెలిపారు. ఆయన స్పష్టం చేస్తూ, “ఈ నివేదిక ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదు. ప్రజాహిత దృష్టితోనే ఈ చర్యలు చేపడుతున్నాం,” అన్నారు.
Also Read
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
Donald Trump: భారత్కు పిడుగులాంటి వార్త! టారిఫ్లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నివేదికపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేయలేదు. ఇది స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక,” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తీరుతెన్నులు ప్రజాధన దుర్వినియోగానికి దారితీశాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం, సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, కమిషన్ సూచనల అమలుకు తగిన చర్యలు చేపట్టనుంది.
తాజావార్తలు
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!