Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి
- వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే అనేక అంశాలపై పార్టీ అధిష్ఠానానికి సూచనలు చేశానని, పలు విషయాల్లో విభేదించానని తెలిపారు. వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి, జిల్లాను ముక్కలుగా విభజించవద్దని అప్పట్లో సూచించానన్నారు. అయితే తన మాటను పట్టించుకోకుండా వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మేలు చేసిందని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ సాధనతో ఆ కుటుంబానికి అధికారం దక్కిందని, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి, దాచుకోవడానికి తెలంగాణను వేదికగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆగం చేసింది కేసీఆర్ అని స్వయంగా ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే చెబుతున్నారని అన్నారు. కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పైనే ఉందని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Shadi Mubarak Scam: 'షాదీ ముబారక్' పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అయితే గతంలో కేసీఆర్ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని, వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. “మీరు చేస్తే రాజకీయాలు, ఇతరులు చేస్తే వ్యభిచారమా?” అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, అహంకారం నచ్చకే తాను ఆయనకు, బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నానని తెలిపారు. తాను దూరమవడం ఒకటైతే, సొంత కుమార్తె కవిత ఎందుకు దూరమైందో కూడా చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్తో కలిసి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OnePlus N6: వన్ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
-
Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
-
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
-
Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!