Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
- తెలంగాణ విభజనపై బీజేపీ వ్యాఖ్యలపై కడియం ఫైర్
- భారత్-పాక్ పోలికపై తీవ్ర ఆగ్రహం
- అభివృద్ధిలో కేంద్రం వివక్ష చూపిందా?
- తెలంగాణ ఆత్మగౌరవంపై రాజకీయ వేడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు , విభజన అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ నాయకత్వం అడుగడుగునా అవమానిస్తోందని, వారి నిజ స్వరూపం తెలంగాణకు వ్యతిరేకమని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు.
Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
తెలంగాణ విభజనను భారత్-పాకిస్తాన్ విడిపోవడంతో పోల్చడం అత్యంత దుర్మార్గమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్మెంట్!
కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, నిధుల కేటాయింపులోనూ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అనేక మంది బలిదానాలను కించపరిచేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నిజంగా తెలంగాణకు అనుకూలమైతే ఇక్కడి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..