Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
- తెలంగాణ విభజనపై బీజేపీ వ్యాఖ్యలపై కడియం ఫైర్
- భారత్-పాక్ పోలికపై తీవ్ర ఆగ్రహం
- అభివృద్ధిలో కేంద్రం వివక్ష చూపిందా?
- తెలంగాణ ఆత్మగౌరవంపై రాజకీయ వేడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు , విభజన అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ నాయకత్వం అడుగడుగునా అవమానిస్తోందని, వారి నిజ స్వరూపం తెలంగాణకు వ్యతిరేకమని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు.
Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
తెలంగాణ విభజనను భారత్-పాకిస్తాన్ విడిపోవడంతో పోల్చడం అత్యంత దుర్మార్గమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్మెంట్!
కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, నిధుల కేటాయింపులోనూ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అనేక మంది బలిదానాలను కించపరిచేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నిజంగా తెలంగాణకు అనుకూలమైతే ఇక్కడి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
-
Vivo Y6e 5G: Snapdragon 4 Gen 2 చిప్సెట్, 6,500mAh బ్యాటరీతో.. వివో Y6e 5G స్మార్ట్ఫోన్ విడుదల
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..