Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
- తెలంగాణ విభజనపై బీజేపీ వ్యాఖ్యలపై కడియం ఫైర్
- భారత్-పాక్ పోలికపై తీవ్ర ఆగ్రహం
- అభివృద్ధిలో కేంద్రం వివక్ష చూపిందా?
- తెలంగాణ ఆత్మగౌరవంపై రాజకీయ వేడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు , విభజన అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ నాయకత్వం అడుగడుగునా అవమానిస్తోందని, వారి నిజ స్వరూపం తెలంగాణకు వ్యతిరేకమని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు.
Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తెలంగాణ విభజనను భారత్-పాకిస్తాన్ విడిపోవడంతో పోల్చడం అత్యంత దుర్మార్గమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్మెంట్!
కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, నిధుల కేటాయింపులోనూ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అనేక మంది బలిదానాలను కించపరిచేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నిజంగా తెలంగాణకు అనుకూలమైతే ఇక్కడి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!