Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- ఆగస్టు 10 వరకు SIR ప్రక్రియకు అవకాశం
- రాష్ట్రంలో 77% ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
- యాదాద్రి టాప్.. హైదరాబాద్లో నెమ్మదిగా ప్రక్రియ
- 100 శాతం పూర్తి చేయాలని సీఈఓ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SIR : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ముమ్మర ఓటర్ల పరిశీలన , సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) బి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడానికి వీలుగా గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల సమాచారాన్ని పక్కాగా నవీకరించడం , అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
77% డిజిటలైజేషన్ పూర్తి.. జిల్లాల వారీగా గణాంకాలు
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 77.12 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సీఈఓ తెలిపారు. మొత్తం 3,38,26,448 ఓటర్లకు గాను 2,60,88,334 ఫారాల డిజిటలైజేషన్ నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 94.25 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, జనగామ (91.44%), మెదక్ (90.52%), సూర్యాపేట (90.35%) , మహబూబాబాద్ (90.08%) జిల్లాలు 90 శాతానికి పైగా డిజిటలైజేషన్తో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి.
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
మరోవైపు హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం, రంగా రెడ్డి జిల్లాలో 63.43 శాతం , హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా, సంగారెడ్డిలో 78.01 శాతం నమోదైంది. ఈ పట్టణ ప్రాంతాలలో కూడా సత్వరమే ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఆగస్టు 10 వరకు సమయం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన గడువులోగా ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని సిఈఓ ఆదేశించారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!