Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- పార్లమెంట్ సజావుగా సాగనివ్వండి
- రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ విజ్ఞప్తి
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరుగుబావుటా ఎగరేసిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిరోజూ అంతరాయం ఏర్పడుతుండటంపై రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో నిరంతరం గందరగోళం కొనసాగడం వల్ల ప్రజల పన్నుల సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్లో ప్రస్తావించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలను లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనను విమర్శించారు.
‘‘పార్లమెంట్ సజావుగా పనిచేయడం లేదు. ప్రతిరోజూ సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోంది. ప్రశ్నోత్తరాల సమయమైనా, జీరో అవర్ అయినా.. మా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించలేకపోతున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఎంపీలపై ఎంతో ఆశలు పెట్టుకుంటారని సాయోని ఘోష్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తారని తెలిపారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
‘‘నా ఒక్కటే విజ్ఞప్తి.. పార్లమెంట్ను సజావుగా నడవనివ్వండి. సభ వెలుపల మీకు నచ్చిన విధంగా నిరసనలు చేయండి. కానీ సభ లోపల పార్లమెంట్ సక్రమంగా సాగేందుకు అధికార పక్షానికి బాధ్యత ఉంది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి’’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని సాయోని ఘోష్ కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత పలువురు ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు.
#WATCH | Kolkata, West Bengal: On the INDIA alliance protest performance targeting Ram Temple donation theft, Rebel TMC MP and NCPI leader Saayoni Ghosh says, “The House is not functioning. The proceedings are being disrupted every day, and taxpayers’ money is being wasted. We… pic.twitter.com/pfHCdzmvBM
— ANI (@ANI) July 31, 2026
తాజావార్తలు
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!