Kadiyam Srihari : కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజీపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని , బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడడం మానుకోవాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘనాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదన్నారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఊహించిందే, కానీ నాయకుల మైండ్ సెట్ మారడం లేదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి అన్న కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేదని, బీఆర్ఎస్ పార్టీ మునుముందు ఉంటుందో,లేదో తెలియదన్నారు కడియం శ్రీహరి. ఆ పార్టీ ఎమ్మెల్యే లు ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేమని, కొంతమంది స్థాయిని, సభ్యతని మార్చి విమర్శించారన్నారు. కులం, మతం, ప్రాంతాన్ని తప్పు పట్టారని, కుక్క కాటుకు చెప్పులాదెబ్బ లా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పారు. 56 వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇచ్చారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందన్నారు. బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడడం, స్థాయికి మించి విమర్శలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పారు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని అన్నారు. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదని విమర్శించారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు.
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
-
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
-
Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?