Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ అడుగులు..
- ఏకకాలంలో పార్టీ బలోపేతం, ప్రజాదరణ లక్ష్యాలు..
- సింగరేణి సంస్థపై కాషాయ దళం స్పెషల్ ఫోకస్..
- 4 ఉమ్మడి జిల్లాలు, 12 నియోజకవర్గాల్లో సంస్థ ప్రభావం..
- అధికారానికి కోల్ బెల్ట్ కీలకమని భావిస్తున్న బీజేపీ..
- ఆక్షన్ లేకుండా సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు..
- మంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకున్నారన్న టాక్..
- మావల్లే సంస్థకు వెలుగని చెప్పే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో అధికారమే తదుపరి లక్ష్యం అంటూ గట్టిగా ప్లాన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందనగానే.. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతోంది కమలం టీమ్. పార్టీ బలోపేతం, ప్రజాదరణను ఏకకాలంలో సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే… తాము బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు కమలనాధులు. మరీ… ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సింగరేణికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉందీ సంస్థ. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయగలిగే సత్తా ఉంది సింగరేణి కార్మికులకు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లు ఇక్కడ కీలకం. ఆ ఓట్లే ఫలితాలను శాసించగలవు కూడా. అందుకే…. ఇప్పుడు కాషాయ దళం ఈ ఓటు బ్యాంక్ మీద ఫోకస్ పెట్టిందట. తాము రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే… కోల్ బెల్ట్ కూడా అత్యంత కీలకమని భావిస్తున్న కాషాయ నేతలు… అక్కడ పాగా వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అందులో భాగంగానే… సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించింది కేంద్రం. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకుని వేలంతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ సంస్థకు తాడిచర్ల బ్లాక్ వచ్చేలా చేశారట. సంస్థ భవిష్యత్ కోసం చేసిన ఈ కృషిని ఇప్పుడు కార్మికులకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. సింగరేణికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో సీరియస్గా ఉన్నారు మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. సింగరేణి భరోసా యాత్ర పేరుతో జరుగుతున్న పర్యటనలు ఇందులో భాగమేనని అంటున్నారు. తెలంగాణ గుండె చప్పుడు సింగరేణిని కాంగ్రెస్, BRSలు నాశనం చేశాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. సంస్థని ఆదుకునేది తామేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచర్ల బ్లాక్ కేటాయింపు ప్రభావం బాగా ఉంటుందని, అది పార్టీకి లాభం అవుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. తమ పర్యటనల్లో భాగంగా బీజేపీ నేతలు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆగుతున్నారు. లోకల్ స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు.
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
- Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ఆ రకంగా మేం మీ తోనే అన్న భావన కలిగిస్తున్నారు. అటు ఇతర కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏదో… వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా తమ పర్యటనల వల్ల పార్టీకి లబ్ది జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ మీద కమలం పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగేలా, విశ్వాసం పెరిగేలా చేస్తున్నారు పార్టీ నేతలు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇంత ముందే రంగంలోకి దిగడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, మరో వైపు ప్రజలు ఇటువైపు చూసేలా చేయడమన్న రెండు లక్ష్యాలను ఏకకాలంలో సాధించాలనుకుంటున్నారట కాషాయ పెద్దలు.
తాజావార్తలు
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!