Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jupally Krishna Rao Criticises Brs Krishna Water Sharing

Jupally Krishna Rao : కృష్ణా జలాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు శాపం

Published Date :January 4, 2026 , 10:24 pm
By Gogikar Sai Krishna
  • కృష్ణా జలాల ఒప్పందాలపై బీఆర్ఎస్‌పై జూపల్లి విమర్శలు
  • 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నారు? అంటూ నిలదీత
  • చర్చకు భయపడి అసెంబ్లీకి దూరమయ్యారని ఆరోపణ
  • తెలంగాణ రైతుల ప్రయోజనాలే మా లక్ష్యమంటూ స్పష్టం
Jupally Krishna Rao : కృష్ణా జలాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు శాపం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒప్పందాలు తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, కృష్ణా జలాల కేటాయింపులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోవడం వెనుక వారి బండారం బయటపడుతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఏ ఉద్దేశంతో సంతకం చేశారని జూపల్లి ప్రశ్నించారు. “తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. అన్నీ తెలిసిన మేధావిని అని చెప్పుకునే కేసీఆర్, మన వాటాగా రావాల్సిన 500 టీఎంసీలకు పైగా జలాలను వదిలేసి, తక్కువ నీటికే ఎందుకు ఒప్పుకున్నారు?” అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.

Also Read

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
  • Road Accident: కారు - బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
Add as a preferred
source on google

హరీష్ రావు మాట్లాడుతున్న మాటల్లో ఏమాత్రం పొంతన లేదని జూపల్లి ఎద్దేవా చేశారు. ఒకసారి 50:50 నిష్పత్తి అని, మరోసారి 69 శాతం వాటా అని, తీరా చూస్తే 299 టీఎంసీల ఒప్పందానికి అంగీకరించారని.. ఇలా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు ఆహ్వానించినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించడం వారి పిరికితనానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. “చర్చకు వస్తే వాస్తవాలు ఆధారాలతో సహా బయటపడతాయి. 30 ఏళ్ల రికార్డులు సమర్పించడంలో మీరు చేసిన విఫల యత్నాలు, కేంద్రం అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పలేకపోయిన సమాధానాలు బట్టబయలవుతాయి. అందుకే బండారం బయటపడతదనే భయంతోనే మీరు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులను, నిధుల కేటాయింపులను ప్రస్తుతం తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని జూపల్లి తెలిపారు. కనీసం 45 టీఎంసీల వినియోగం విషయంలోనైనా స్పష్టమైన క్లియరెన్స్ తెచ్చుకుని, పాలమూరు ఎత్తిపోతల పనులను వేగవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్ది తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Government
  • Jupally Krishna Rao
  • Krishna Water Dispute
  • telangana farmers

తాజావార్తలు

  • Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!

  • Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!

  • Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్

  • Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?

  • Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions