Jithender Reddy: పేరు, వాస్తు మార్చుకున్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jithender Reddy Says BRS Wont Win In Telangana Elections: పార్టీ పేరు మార్చుకున్నా, వాస్తు మార్చుకున్నా.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని.. ఆ రెండు పార్టీల చుట్టరికం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచే నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చారని.. ఈటల రాజేందర్, విజయరామరావు తదితరులు వచ్చి, దత్తాత్రేయను కలిసి వెళ్లారని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తాను చేసిన ట్వీట్ చూసి బాగుందని చెప్పారని వెల్లడించారు.
Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్మనిపిస్తున్న మౌని రాయ్
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
ఇదే సమయంలో.. తనకు, ఈటలకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఈటలతో కలిసి పని చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఈటలతో కలిసి పదేళ్లు పని చేశానని, ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే సంతోషిస్తానని అన్నారు. ఈటలతో పాటు పార్టీ నేతలందరూ కలుస్తూనే ఉంటారని తెలిపారు. బీజేపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు. తాను మహబూబ్ నగర్ ప్రజల్లోనే ఉంటానన్నారు. తాను పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉంటానని.. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే (ఎమ్మెల్యే, ఎంపి), తాను అక్కడ పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి
అలాగే.. బీజేపీపై ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని జితేందర్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్కు బీజేపీ ‘బీ-టీమ్’ కాదని.. 2004లో బీఆర్ఎస్తో బంధుత్వం ఎరువ పెట్టుకున్నారో రాహుల్ తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటి చేరికతో.. వాపును చూసి కాంగ్రెస్ బలుపు అనుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!