Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Says BRS and Congress Parties DNA Same: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు కలిసి సంసారం చేశాయని ఎంపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయని.. అధికారమూ పంచుకున్నాయని అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆ రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ రెండూ కలిసి పని చేశాయని చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ వల్లే అత్యంత ప్రమాదకరమని గతంలో వాజ్పేయు చెప్పారని గుర్తు చేశారు.
Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
కులాలు, భాషలు, మతాల పేరుతో పబ్బం గడుపుకునే పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి కుర్చీని నిలుపుకోవడం కోసం.. ప్రజాస్వామ్యాన్ని మంటకలిపిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కుటుంబాలకు అధికారం కట్టబెట్టడం కోసం పాకులాడే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. తాము బీఆర్ఎస్కు బీ-టీమ్గా ఎప్పుడూ ఉండమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఘోరవైఫల్యం చెందారని అన్నారు. ఈ నెల 8న వరంగల్లో పలు అభివృధ్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని వెల్లడించారు. రోజుకు మూడు వ్యాగన్లు చొప్పున ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రానికి ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారన్నారు.
Koppula Eshwar: రేవంత్, ఇదీ మీ సంస్కారం.. మంత్రి ఈశ్వర్ కౌంటర్ ఎటాక్
బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్కు కూడా అంతే దూరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా రెండు పార్టీలు తూర్పు, పడమరగా ఉన్నాయని చెప్పారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో ‘బీ-టీమ్’ అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినట్టే.. రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ ఊహాలోకంలో విహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారని.. అది తేల్చాల్సింది తెలంగాణ ప్రజలని, అసమర్థుడైన రాహుల్ కాదంటూ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
-
Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?