Jangaon Hostel: గోడదూకి 19 మంది విద్యార్థులు జంప్.. జనగామ హాస్టల్ లో ఘటన
- జనగామ పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్లో వింత ఘటన..
- అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్..
- పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళన..
- జనగామ ధర్మకంచలోని పాత వసతి గృహానికి చేరుకున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon Hostel: జనగామ జిల్లా పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్లో వింత ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గోడ దూకి 19 మంది విద్యార్థులు పరారయ్యారు. పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందారు. సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి జనగామ ధర్మకంచలోని పాత వసతి గృహానికి చేరుకున్నారు. ధర్మకంచం వద్ద పిల్లలు ఉన్నారనే సమాచారంతో తల్లదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళితే సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ధర్మకంచం హాస్టల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే పాఠశాలలో సరైన వసతులు లేవని, ఇక్కడ ఉండడం కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అధ్యాపకులు తమను వేధిస్తున్నారని, వసతులు లేవని అడిగితే ఇక్కడ ఇలాగే ఉంటుందని బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
Read also: Drink Own Urine: ఇదేం ఖర్మ రా నాయనా.. తన మూత్రం తనే తాగుతున్న వ్యక్తి..
Also Read
జనగామలోని ధర్మకంచ హాస్టల్లో సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పెంబర్తి హాస్టల్కు తరలించాలని పేర్కొన్నారు. పాత హాస్టల్లోనే ఉంటామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధికారులు స్పందించి ధర్మకంచ హాస్టల్ లో ఉండేలా కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడలేని భాషలో బూటకపు మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంబర్తి హాస్టల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ అనిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెంబర్తిలో మరో భవనాన్ని అద్దెకు తీసుకున్నామని, దూషించే ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు రిలీఫ్.. రెండు పరీక్షలను ఒకేచోట రాసేందుకు ఛాన్స్..
తాజావార్తలు
-
Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
-
Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..