Jangaon Crime: జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. కిడ్నాప్ చేసి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon Crime: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. అతడిని హత్య చేసింది సుపారీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది.
బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య గురువారం 15న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రామకృష్ణయ్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని మామిడితోట సమీపంలో బైక్ను గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు బైక్పై వెళుతున్న రామకృష్ణను మార్గమధ్యంలో దుండగులు ఆపి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణ హత్యకు గురైనట్లు గుర్తించారు. భూ వివాదంలో రామకృష్ణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది. శనివారం రాత్రే రామకృష్ణ హత్య జరిగినట్టు, మృతదేహాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ బీఆర్ఎస్ నాయకుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీస్కునట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
Read also: Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
రామకృష్ణ గతంలో నర్మెట్ట, రఘునాథపల్లి, భూపాలపల్లి జిల్లాలో ఎంపీడీఓ గా పని చేశారు. ఆ తరవాత ఇంటి వద్దే ఉంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో ఆక్టివ్ పని చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ, తదితర ప్రభుత్వ కార్యాలయాల నుండి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవాడు. బచ్చన్నపేట మండలంలోని చిన్నారంచర్ల గ్రామ పరిధిలోని ఓ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్న దాంట్లో రామకృష్ణ సపోర్ట్ ఉందనే అనుమానంతో కిడ్నప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. రామకృష్ణ ఆర్టీఐ చట్టం ద్వారా అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారని.. ఇదే ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రోద్బలంతో రామకృష్ణయ్య కిడ్నాప్ జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా అధికార పార్టీ నేతల కబ్జాలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ నేతలను తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారమే మృత దేహాన్ని గుర్తిస్తే.. ఇంతవరకు ఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్బీఐ
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!