Jangaon Crime: జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. కిడ్నాప్ చేసి మరీ..
Jangaon Crime: జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. అతడిని హత్య చేసింది సుపారీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది.
బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య గురువారం 15న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రామకృష్ణయ్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని మామిడితోట సమీపంలో బైక్ను గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు బైక్పై వెళుతున్న రామకృష్ణను మార్గమధ్యంలో దుండగులు ఆపి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణ హత్యకు గురైనట్లు గుర్తించారు. భూ వివాదంలో రామకృష్ణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు తరవాత ఆచూకీ లభ్యమైంది. శనివారం రాత్రే రామకృష్ణ హత్య జరిగినట్టు, మృతదేహాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ బీఆర్ఎస్ నాయకుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీస్కునట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
Read also: Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
రామకృష్ణ గతంలో నర్మెట్ట, రఘునాథపల్లి, భూపాలపల్లి జిల్లాలో ఎంపీడీఓ గా పని చేశారు. ఆ తరవాత ఇంటి వద్దే ఉంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో ఆక్టివ్ పని చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ, తదితర ప్రభుత్వ కార్యాలయాల నుండి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవాడు. బచ్చన్నపేట మండలంలోని చిన్నారంచర్ల గ్రామ పరిధిలోని ఓ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్న దాంట్లో రామకృష్ణ సపోర్ట్ ఉందనే అనుమానంతో కిడ్నప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. రామకృష్ణ ఆర్టీఐ చట్టం ద్వారా అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారని.. ఇదే ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రోద్బలంతో రామకృష్ణయ్య కిడ్నాప్ జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా అధికార పార్టీ నేతల కబ్జాలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ నేతలను తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారమే మృత దేహాన్ని గుర్తిస్తే.. ఇంతవరకు ఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్బీఐ
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో