RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించకుండా పోయాయని మీడియాలో వచ్చిన కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రింటింగ్ ప్రెస్ల్లో ముద్రితమైన రూ.500 నోట్లు మాయం అయ్యాయని కొన్ని మీడియా సంస్థలు దుష్పచారం చేస్తున్నాయని ఆర్బీఐ ఆరోపించింది. ఈ వార్తలను కొట్టిపారేసిన ఆర్బీఐ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలోని మిస్టరీని ఛేదించింది.
సమాచార హక్కు (ఆర్టీఐ) నుంచి అందిన సమాచారం ఆధారంగా రూ. 500 కొత్త నోట్లు ‘తప్పిపోయాయని’ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ నోట్ ప్రెస్ 881.06 కోట్ల కొత్త నోట్లను ముద్రించిందని, అయితే 726 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బిఐకి చేరాయని ఆర్టిఐలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై మీడియాలో వచ్చిన వార్తలను ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐలో ఇచ్చిన సమాచారం సరైన సందర్భంలో అర్థం కాలేదని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. ఈ నివేదిక సరైనది కాదు. ఆర్టీఐలో ప్రభుత్వ ప్రెస్ను కోరిన సమాచారం ప్రకారం ఎన్ని నోట్లు ముద్రించబడ్డాయో మాత్రమే తెలియజేస్తుంది.
Also Read
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
Read Also:Saif Ali Khan : ఆదిపురుష్ సినిమా ఫలితం సైఫ్ ముందే ఊహించాడా..?
సమాచార హక్కు చట్టం-2005 కింద కోరిన సమాచారానికి వివరణ సరిగ్గా జరగలేదు. ప్రెస్ నుండి ఆర్బిఐకి నోట్ల సరఫరా బలమైన వ్యవస్థ ఉంది. ప్రెస్ నుంచి బ్యాంకుకు వచ్చిన ప్రతి నోటుకు లెక్క ఉంటుంది. ఇందులో నోట్ల ముద్రణే కాకుండా వాటి నిల్వ, పంపిణీకి సంబంధించిన సమాచారం కూడా దృఢంగా ఉంచుతారు. ఆర్బీఐ స్వయంగా తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. దీన్ని సామాన్యులు విశ్వసించాలి.
Read Also:Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!
రూ.2000 నోట్లను నిషేధించారు
RBI తాజాగా 2000 రూపాయల నోట్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. 2016లో దేశంలో కొత్త 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సమయంలోనే ఈ 2000 రూపాయల నోట్లను కూడా ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!