Jagga Reddy: సీఎం కేసీఆర్ ను పొగిడిన జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వం చేసే మంచి పనులను పొగుడుతూ ఉంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను బహిరంగంగానే పొగిడారు.
ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎంను పొగడక తప్పట్లేదు అంటూనే ప్రశంసలు కురిపించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ రావడానికి సీఎం సహకారం చాలా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ వచ్చి ఆస్పత్రి ప్రారంభించాలని… ఏ పార్టీ అయిన పని జరగాలంటే అందరి సహకారం కావాలని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ని మెడికల్ కాలేజీ కోసం ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ అడిగానని… దీనిపై సీఎం అనుకూలంగా స్పందించారని.. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం వల్ల చుట్టుపక్కల పేద వారికి వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు దొరుకుతాయి అన్నారు. గాంధీ, ఉస్మానియా కి ధీటుగా ఈ కాలేజీ ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. పార్టీకి రాజీనామా చేసి సంగారెడ్డి నుంచి పోటీ చేస్తానని… కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థిని పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో కాస్త మెత్తపడ్డారు.
తనకు సోనియా, రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించాలని, పార్టీలో జరిగే పరిణామాల గురించి అధిష్టానానికి వివరిస్తా అని అన్నారు. దీంతో ఇటీవల రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి కుటుంబం ప్రత్యేకంగా సమావేశం అయింది. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి వివాదం సమసిపోయింది. ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలని రాహుల్ సూచించినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఇటీవల వరంగల్ కేంద్రంగా జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు జగ్గారెడ్డి ముందుండి వ్యవహరించారు. ఉమ్మడి మెదక్ నుంచి భారీగా జనసమీకరణ చేశారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయ్యేందుకు సహకరించారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!