Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
- కాళేశ్వరం అవినీతి.. లక్ష కోట్లు వేశారంటే 30 వేల కోట్లు కొట్టేశారా?
- కేసీఆర్ కూతురు ఢిల్లీ దుకాణం.. కుటుంబమే డాన్ల సంస్థగా మారిందన్న జగ్గారెడ్డి
- లిక్కర్ మాఫియా.. కేటీఆర్ బావమరిది-సంతోష్ సుట్టాలపై సంచలన ఆరోపణలు
- రేవంత్ బెడ్రూంలోకి పోలీసులు.. ఇది హద్దులు దాటి చేసిన దౌర్జన్యం : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి,” అని జగ్గారెడ్డి అన్నారు.
“మీరు దొంగలు.. మాపై నిందలు వేస్తారా? మీ పార్టీలా మేము ప్రైవేటు కంపెనీ అనుకున్నామా? ఔటర్ రింగ్ రోడ్ లీజుకు ఇచ్చి దాంట్లో డబ్బులు కొట్టారు. అప్పుల్లో కూడా కమిషన్లు వసూలు చేశారు. ఇలాంటి దందా ఎవడు చేయడు.. కానీ మీరు చేశారు,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ కూతురు ఢిల్లీ లో పెద్ద దుకాణం తెరిచింది. కేజ్రీవాల్ కథ ముగిసిపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం డాన్ల కంపెనీ అయింది. మిగిలింది ఏమీ లేదు.. చెరువులు కూడా మింగేశారు,” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
Tension in Nandigama: వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
“లిక్కర్ దందా పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి రెండు గంటల వరకు సాగుతోంది. నేను పోలీసులను అడిగితే అది కేటీఆర్ బామ్మర్ది దందా అంటున్నారు. రోడ్డుకి లెఫ్ట్ కేటీఆర్ బావమరిది, రైట్ సంతోష్ సుట్టాలు.. ఇది ఏమి దందా? మొగోడివైతే స్పందించు ప్రభాకర్ రెడ్డి,” అంటూ కౌంటర్ వేశారు. “రేవంత్ రెడ్డిని ఎంతగా వేధించారు. జగ్గారెడ్డి, రేవంత్ ఇద్దరమూ కేసీఆర్ కుట్రల బాధితులమే. రేవంత్ బెడ్రూం వరకు పోలీసులు చొరబడ్డారు. ఇది ఏ స్థాయి దౌర్జన్యం చెప్పండి. కానీ రేవంత్ మాత్రం మిమ్మల్ని కొడుతున్నాడా? తిడుతున్నాడా?” అంటూ ప్రశ్నించారు.
“బీజేపీ వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. గాంధీ కుటుంబం మాత్రమే దేశ మత సామరస్యాన్ని కాపాడుతుంది. కరెన్సీ మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలి అనేది బీజేపీ లైన్. వాళ్లది బ్లాక్ మెయిల్ దందా,” అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
US President’s Salary: యూఎస్ ప్రెసిడెంట్ సాలరీ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!