Tension in Nandigama: వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
- ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టెన్షన్ టెన్షన్..
- వైఎస్ విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారులు..
- ట్రాఫిక్కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు..
- ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు… గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు.. వైసీపీ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో నిరసన తెలిపారు.. రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రాంతంలో నిచ్చెన వేసుకుని ఎక్కి నిరసన తెలిపారు..
Read Also: PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
అయితే, ఈ నిరసన సమయంలో వైసీపీ నాయకులు.. స్థానిక సీఐ మధ్య వాగ్వాదం జరిగింది.. ఎక్కడైతే విగ్రహం తొలగించారో అదే ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొబైల్ విగ్రహం ఏర్పాటు చేసింది వైసీపీ.. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని చూడటానికి వీలులేదని పోలీసులు అడ్డుకోగా.. పోలీసులను తోసుకుంటూ గేటు నెట్టేసి లోపలికి వెళ్లారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మున్సిపల్ ఆఫీస్లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు నేతలు.. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దేవినేని అవినాష్.. మొండితోక జగన్ మోహన్ రావు..
Read Also: Dhruv Jurel: కెప్టెన్గా ధ్రువ్ జురెల్.. రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ వైరల్!
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కోర్టు దృష్టికి తీసుకెళ్తే విగ్రహాన్ని తొలగించమని చెప్పిన అధికారులు.. దొంగల్లాగా అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని తొలగించారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చూస్తే చాలా బాధేసింది.. విగ్రహానికి చెయ్యి విరిగిపోయింది.. డ్యామేజ్ అయింది.. దీని వెనుక ఎవరి పాత్ర ఉన్నా.. వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.. ఇక, గత ఐదేళ్లు నందిగామలో ప్రశాంత వాతావరణం ఉందని.. ఇప్పుడు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం రాగానే తిరిగి ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహం తొలగించారో అక్కడే మళ్లీ ప్రతిష్టిస్తామని ప్రకటించారు.. ఎంపీ, ఎమ్మెల్యేకి ఇసుక, మద్యం తదితర అక్రమ వ్యాపారాల విషయంలో మామూళ్ల కోసం గొడవలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు దేవినినేని అవినాష్..
తాజావార్తలు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?