Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- పవన్ వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
- ‘మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారు’ అంటూ విమర్శలు
- తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించబోమని హెచ్చరిక
- జనసేన రాజకీయాలపై బీఆర్ఎస్ నేత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని అవహేళన చేసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ స్వంతంగా ఏమీ మాట్లాడటం లేదని, ప్రధాని నరేంద్ర మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ను ఇక్కడ చదువుతున్నారని, ఆయనను చూస్తుంటే మోడీ ఏజెంట్లా అనిపిస్తోందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సినిమాల్లో చెప్పే డైలాగులను రాజకీయాల్లో మాట్లాడటం పవన్ కళ్యాణ్కు అలవాటుగా మారిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. తనను ఎవరో అడ్డుకున్నారని గాల్లో మాటలు చెప్పడం సరికాదని, అసలు ఆయనను ఎవరు, ఎక్కడ అడ్డుకున్నారో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్ అయినా, ఆయన కుటుంబమైనా తెలంగాణ ప్రజల ఆదరణ, భిక్ష వల్లే ఈ రోజు సినిమా రంగంలో ఇంతలా బాగుపడ్డారనే నిజాన్ని మరిచిపోకూడదని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
ప్రస్తుతం తెలంగాణ ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్తో ఈ విధమైన రాజకీయ డ్రామాలు ఆడిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కు ఎన్ని ఓట్లు వచ్చాయో, ఇక్కడి ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరించారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని, పవన్ కళ్యాణ్ చెప్పే కట్టుకథలను గానీ, ఆయన మాటలను గానీ నమ్మే పరిస్థితిలో ఇక్కడి సమాజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!