Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- పవన్ వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
- ‘మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారు’ అంటూ విమర్శలు
- తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించబోమని హెచ్చరిక
- జనసేన రాజకీయాలపై బీఆర్ఎస్ నేత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని అవహేళన చేసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ స్వంతంగా ఏమీ మాట్లాడటం లేదని, ప్రధాని నరేంద్ర మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ను ఇక్కడ చదువుతున్నారని, ఆయనను చూస్తుంటే మోడీ ఏజెంట్లా అనిపిస్తోందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సినిమాల్లో చెప్పే డైలాగులను రాజకీయాల్లో మాట్లాడటం పవన్ కళ్యాణ్కు అలవాటుగా మారిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. తనను ఎవరో అడ్డుకున్నారని గాల్లో మాటలు చెప్పడం సరికాదని, అసలు ఆయనను ఎవరు, ఎక్కడ అడ్డుకున్నారో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్ అయినా, ఆయన కుటుంబమైనా తెలంగాణ ప్రజల ఆదరణ, భిక్ష వల్లే ఈ రోజు సినిమా రంగంలో ఇంతలా బాగుపడ్డారనే నిజాన్ని మరిచిపోకూడదని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ప్రస్తుతం తెలంగాణ ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్తో ఈ విధమైన రాజకీయ డ్రామాలు ఆడిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కు ఎన్ని ఓట్లు వచ్చాయో, ఇక్కడి ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరించారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని, పవన్ కళ్యాణ్ చెప్పే కట్టుకథలను గానీ, ఆయన మాటలను గానీ నమ్మే పరిస్థితిలో ఇక్కడి సమాజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!