Jagadish Reddy : కాంగ్రెస్ మార్పు మాత్రం తిరోగమనంలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల అవుతోందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల అనేది తక్కువ కాలం కాదన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెప్పితే…. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారన్నారు. మార్పు మాత్రం తీరోగమనంలా ఉన్నదని, బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ మీదా నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారని జగదీష్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా..’ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందీ కరువు వచ్చింది…. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్ళు ఇచ్చాం. ఇవ్వాళ నాగార్జున సాగర్ లో నీళ్ళు ఉన్నా…. రైతులకు నీళ్ళు ఇవ్వడం చేత కావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళు ఉన్నా…. ప్రభుత్వం కాంగ్రెసే ఉన్నా అడగడం చేత కావడం లేదు. మానవ బాంబులు అయితాం…. పేగులు మెడలో వేసుకుటాం… ఏం భాష రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇవ్వాళ రైతుల పేగులు నీ మెడలో వేసుకునే పరిస్థితీ వచ్చిందీ. ఇవ్వాళ వ్యవసాయ రంగం మీదా సమీక్ష లేదు… పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవ్వాళ కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్ళు వృధాగా పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకి కరువు కనపడడం లేదు….
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
బీఆర్ఎస్ శంఖుస్థాపనలు చేసిన పనులు మొదలు పెట్టుకుంటు…. 90 రోజుల్లో అది చేశాం, ఇది చేశామనీ గొప్పలు చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకొని పోవాలని చూస్తున్నారు…. బిఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటనే నీటి పారుదల పైన సమీక్ష చేయాలి…. రైతాంగానికి ఏం బరోసా ఇస్తారో చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాని….. కరువు పర్యటన చెయ్యాలి. గుత్తా అమిత్ రెడ్డినీ ఎవరు అడ్డుకోవడం లేదు…. ఆయనే ప్రకటన చేసుకున్నాడు …… ఆయనే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు….. రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది.’ అని జగదీష్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!