Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాలు లేవు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ రెండు నెలలు రైతులకు చాలా కీలకం. కాయలు పెరిగే కొద్దీ వర్షాలు అవసరం. అయితే జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. అయితే గత 15 రోజులుగా అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. తాజాగా, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read also: Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం..
Also Read
హైదరాబాద్లో శనివారం వాతావరణం చల్లబడింది. ఇటీవలి కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కిపడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ నగర్ క్రాస్ రోడ్, అశోకాపోల్, అశోకాపోల్. నగర్, అబిడ్స్, కోఠి, లోయర్ ట్యాంక్ బండ్, హబ్సిగూడ, రామాంతపూర్, ఉప్పల్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం ఇతర ప్రాంతాలు వర్షం అందుకుంది. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also: Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలను తనవైపు తిప్పుకోనుంది. ఆ మేఘాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఆవరించగా, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఏపీలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం రాయలసీమలో లేదని, అక్కడ వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని తెలిపారు. బంగాళాఖాతంలో చెన్నై సమీపంలో స్వల్ప వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!