Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాలు లేవు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ రెండు నెలలు రైతులకు చాలా కీలకం. కాయలు పెరిగే కొద్దీ వర్షాలు అవసరం. అయితే జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. అయితే గత 15 రోజులుగా అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. తాజాగా, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read also: Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
హైదరాబాద్లో శనివారం వాతావరణం చల్లబడింది. ఇటీవలి కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కిపడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ నగర్ క్రాస్ రోడ్, అశోకాపోల్, అశోకాపోల్. నగర్, అబిడ్స్, కోఠి, లోయర్ ట్యాంక్ బండ్, హబ్సిగూడ, రామాంతపూర్, ఉప్పల్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం ఇతర ప్రాంతాలు వర్షం అందుకుంది. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also: Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలను తనవైపు తిప్పుకోనుంది. ఆ మేఘాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఆవరించగా, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఏపీలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం రాయలసీమలో లేదని, అక్కడ వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని తెలిపారు. బంగాళాఖాతంలో చెన్నై సమీపంలో స్వల్ప వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..