IT Raids 4th day: హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. భారీ నగదు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids 4th day: ఐటీ సోదాలు హైదరాబాద్ లో నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ సోదాలు నిర్వహించింది. సుమారు 100 మంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థగా పేరొందిన కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ గ్రూప్ కంపెనీ అహ్మద్ ఖాద్రీ ఇల్లు, 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, స్థలాల డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Read also: Chief ministers: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. దేశ అంశాలపై మాట్లాడే అవకాశం
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఈ సోదాల్లో కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పేరుతో రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. కేఎం కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నాలుగు రోజులుగా సోదాలు జరగడం సంచలనంగా మారింది. ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ కంపెనీలో పలువురు రాజకీయ నేతల బినామీలు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఈ సంస్థ పలు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా వెంచర్లు వేసినట్లు తెలుస్తోంది. వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే హైదరాబాద్లో నిర్వహిస్తున్న విజ్ రియల్టీలు, విజ్ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ కోహినూర్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టల్ మాన్షన్కు చెందిన ఆర్ఆర్ పాన్మసాలా, హాస్పిటాలిటీస్, స్పైసెస్, మజీద్ ఖాన్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక, నోయిడాలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?