IT Raids 4th day: హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. భారీ నగదు స్వాధీనం
IT Raids 4th day: ఐటీ సోదాలు హైదరాబాద్ లో నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ సోదాలు నిర్వహించింది. సుమారు 100 మంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థగా పేరొందిన కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ గ్రూప్ కంపెనీ అహ్మద్ ఖాద్రీ ఇల్లు, 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, స్థలాల డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Read also: Chief ministers: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. దేశ అంశాలపై మాట్లాడే అవకాశం
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
ఈ సోదాల్లో కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పేరుతో రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. కేఎం కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నాలుగు రోజులుగా సోదాలు జరగడం సంచలనంగా మారింది. ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ కంపెనీలో పలువురు రాజకీయ నేతల బినామీలు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఈ సంస్థ పలు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా వెంచర్లు వేసినట్లు తెలుస్తోంది. వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే హైదరాబాద్లో నిర్వహిస్తున్న విజ్ రియల్టీలు, విజ్ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ కోహినూర్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టల్ మాన్షన్కు చెందిన ఆర్ఆర్ పాన్మసాలా, హాస్పిటాలిటీస్, స్పైసెస్, మజీద్ ఖాన్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక, నోయిడాలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!