IT Raids 4th day: హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. భారీ నగదు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids 4th day: ఐటీ సోదాలు హైదరాబాద్ లో నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ సోదాలు నిర్వహించింది. సుమారు 100 మంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థగా పేరొందిన కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ గ్రూప్ కంపెనీ అహ్మద్ ఖాద్రీ ఇల్లు, 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, స్థలాల డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Read also: Chief ministers: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. దేశ అంశాలపై మాట్లాడే అవకాశం
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఈ సోదాల్లో కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పేరుతో రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. కేఎం కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నాలుగు రోజులుగా సోదాలు జరగడం సంచలనంగా మారింది. ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ కంపెనీలో పలువురు రాజకీయ నేతల బినామీలు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఈ సంస్థ పలు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా వెంచర్లు వేసినట్లు తెలుస్తోంది. వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే హైదరాబాద్లో నిర్వహిస్తున్న విజ్ రియల్టీలు, విజ్ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ కోహినూర్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టల్ మాన్షన్కు చెందిన ఆర్ఆర్ పాన్మసాలా, హాస్పిటాలిటీస్, స్పైసెస్, మజీద్ ఖాన్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక, నోయిడాలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!