Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
Harish Rao: తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్, బండి సంజయ్ లకు రాష్ట్ర అధ్యక్షుడి పదవులు వచ్చేవా? కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని మంత్రి హరీశ్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో 100 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి కృషితో అన్ని సకల సౌకర్యాలతో జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మించుకుని ప్రారంభించుకున్నామని అన్నారు. బట్టకాల్చి మీద వేయడం, గోబెల్స్ ప్రచారం చేయడమే రేవంత్ పని అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరో 20 ఏళ్లు అయినా ఒక్క మెడికల్ కాలేజీ వచ్చి ఉండేది కాదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీ లు నిర్మించుకున్నామన్నారు. గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఒక్క ఆసుపత్రి కూడా తీసుకురాలేదని ఎద్దేవ చేశారు.
కానీ.. అప్పుడు మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి కొడంగల్ కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పాలమూరుకు కరువు, కాటకాలు , వలసలను ఇచ్చిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల కంటే కూడా ప్రతిపక్ష పార్టీలు దారుణంగా తరయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్, బండి సంజయ్ లకు రాష్ట్ర అధ్యక్షుడి పదవులు వచ్చేవా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చెడ గొట్టే పనులు తప్ప మంచి చేసే పనులు మాత్రం చేయరని తీవ్రంగా మండిపడ్డారు. ఆనాడు ఉద్యమంలో కలిసి రాలేదు. ఈనాడు ఉత్సవాలు జరుపుకోవద్దు అంటున్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ కారులను, అమరులను అవమానపర్చినట్లే అంటూ మండిపడ్డారు. ఈ 9 ఏళ్ల BRS పాలనలో ప్రజలు పాస్ అయ్యారని అన్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పాలన వద్దని రాష్ర్టం మొత్తం ముక్తకంఠంతో చెబుతుందని అన్నారు. 50 సిట్లల్లో అభ్యర్థులే లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని అన్నారు. చిన్న కల్వకుర్తి ప్రాజెక్టును కట్టేందుకు కాంగ్రెస్ కు 20 ఏళ్లు పట్టింది. అంతకు పదింతలు రెట్టింపైన పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టును వేగంగా కట్టుకుంటున్నామని తెలిపారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 8 ఏళ్లలో BRS ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. ఆనాడు పాలమూరు నుంచి వలసలు పోతే నేడు ఇదే వలసల జిల్లాకు ఇతర జిల్లాలు, రాష్టల నుంచి వలస వచ్చి కూలీ పనులు చేయిస్తున్నారని తెలిపారు. పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో BRS పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ పాలన తెస్తాం అంటే .. గతంలో ఉన్న 200 ఫించెన్ ను తెచ్చుకోవడం, దళిత, రైతు బందులను వదులుకోవడమే అని హరీశ్ రావ్ తెలిపారు.
Sandra Venkata Veeraiah: కావాలనే పోడుపై ధర్నాలు.. సండ్ర సీరియస్
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!