Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News It Officials Questioning Ends First Day In It Raids On Malla Reddy Case

IT Raids on Malla Reddy Case: తొలిరోజు ముగిసిన విచారణ.. మరో 10 మందికి నోటీసులు

Published Date :November 28, 2022 , 8:11 pm
By Sudhakar Ravula
IT Raids on Malla Reddy Case: తొలిరోజు ముగిసిన విచారణ.. మరో 10 మందికి నోటీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది.. అయితే, మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల సమన్లు పంపారు.. ఇవాళ్టి విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా 10 మందికి సమన్లు జారీ చేశారు.. డిసెంబర్ 5వ తేదీ వరకూ పలువురిని వరుసగా విచారించనున్నారు.. విచారణలో ప్రధానం మెడికల్ సీట్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు ఐటీ అధికారులు.. రేపు మంత్రి మల్లారెడ్డి తరుఫున ఆడిటర్‌ విచారణకు హాజరుకాబోతున్నారు.

Read Also: CM KCR: యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కేసీఆర్.. ఇది దేశ కీర్తి పెంచుతుంది..

ఇక, తొలిరోజు విచారణ ముగియడంతో.. ఐటీ కార్యాలయం నుండి వెళ్లిపోయారు మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి.. అయితే, మహేందర్ రెడ్డిని ఇవాళ రమ్మని చెప్పి నోటీసు ఇవ్వలేదు, అందుకే మహేందర్ రెడ్డి విచారణకు రాలేదని.. డిసెంబర్ 5వ తేదీ వరకు విచారణకు రావాలని మా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన చాలా మందికి నోటీసులు పంపించారు.. క్లర్క్‌ స్థాయి నుండి మొదలు పెడితే అకౌంటెంట్ డైరెక్టర్ల వరకు ఈ నోటీసులు ఉన్నాయని.. విచారణలో ఒక ఫార్మాట్‌లో తమని డీటెయిల్స్ ఇవ్వమన్నారు వాటిని ఆ ఫార్మట్‌లో ఇచ్చామని.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామన్నారని తెలిపారు.. తాము ఐటీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని మీడియాకు వివరించారు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి.

అయితే, తొలిరోజు ఐదు గంటల పాటు విచారణ సాగింది.. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు ఐటీ అధికారులు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు, ఫీజు వసూలుపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు.. ఐటీ అధికారులు ఇచ్చిన ఫార్మట్‌లోనే వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అదే ఫాలో అయ్యారు.. ఇక, తొలిరోజు విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేం సమాధానాలు చెప్పాం.. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారని.. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారన్నారు.. మేం చెప్పిన సమాధానాలతో ఐటీ అధికారులు సంతృప్తి చెందిఉంటారని తాను భావిస్తున్నానని వెల్లడించారు.

ఇక, మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారు.. ఐటి అధికారుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తామన్నారు.. మరోవైపు.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి మల్లారెడ్డి కుమారుడు చామకూర భద్రారెడ్డి.. మాతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని విచారణ చేశారు.. మా స్టేట్‌మెంట్‌తో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు.. మేం చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు భద్రారెడ్డి. మొత్తంగా తొలిరోజు విచారణ ముగిసింది.. ఈ కేసులో నోటీసులు, విచారణ ఉత్కంఠరేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • IT Officials Questioning
  • it raids
  • IT Raids on Malla Reddy Case
  • Minister Malla Reddy

తాజావార్తలు

  • PAK vs BAN: మొన్నటి వరకు చెట్టాపట్టాల్, ఇప్పుడు మాటల యుద్ధాలు.. ఒక్క ‘‘రనౌట్’’ పరిస్థితిని మార్చింది..

  • Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!

  • BCCI Naman Awards: లెజెండ్స్‌కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అత్యున్నత పురస్కారాలు..

  • Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…

  • Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions