వరి సేద్యంపై ఆంక్షలు విధించడం సరైంది కాదు: ఉత్తమ్ కుమార్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి సేద్యం పై ఆంక్షలు విధించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు వారి ప్రాథమిక బాధ్యతను విస్మరించాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దు.. పామాయిల్ పంట వేసుకోమ్మంటాడని, పామాయిల్ లాంగ్ టర్మ్ పంట అని ఆయన అన్నారు. వరి రైతు లకు మద్దతుగా కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఖరీఫ్ పంట ధాన్యం గురించి మాట్లాడకుండా.. రబీ గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బియ్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్న ఎందుకు చేయడం లేదని ఆయన విమర్శించారు.
అనంతరం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రోజుల కొద్దీ వరి రైతులు కల్లాల్లో ఉండటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతు న్నార న్నారు. వరి తప్ప మరో పంట పండని భూమిల్ని రైతు ఏం చేయాలో కేసీఆర్ చెప్పాలన్నారు. ఇప్పుడు పండిన వడ్లు కొనుగోలు చేయడం పక్కన పెట్టి ఎండాకాలం వడ్ల కొనుగోలుపై కేసీఆర్ మాట్లాడుతు న్నారన్నారు. కల్లాలలో వడ్లు మొలకలెత్తుతున్నా యన్నారు. కేసీఆర్ కేంద్రం పై యుద్ధం చేసే ముందు.. వర్షాకాల వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్రం పై యుద్ధం ప్రకటించి.. చాలా సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. భూములను కార్పోరేట్ శక్తులకు అప్పగించే కుట్ర కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంకా ఆలస్యం చేస్తే అది ప్రభుత్వానికే మంచిది కాదని భట్టి హెచ్చరించారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం రైతులకు మద్ధతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసింది మొదటగా కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుచేశారు. గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమో అన్న లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ధాన్యం తరలించే ట్రాన్స్ పోర్ట్ టెండర్ల పక్రియ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. నిల్వ సామర్థ్యం సరిపోయేంత లేదు.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు. షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము చెప్పిన పంటలనే వేయాలని ప్రభుత్వాలు రైతులను బెదిరిస్తున్నాయని శ్రీధర్ బాబు అన్నారు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!