కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని నాలుగు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీరి ఇద్దరిపై పీఎంఎల్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని, కార్వీ స్టాక్ బ్రోకింగ్ 2873 కోట్లు రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్వీ పై సీసీఎస్ కు ఫిర్యాదు చేసింది, ఆ ఆధాఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారులు వెల్లండించారు.
గత ఏడాది సెప్టెంబర్ లోనే కార్వీ ఉద్యోగుల స్టేట్మెంట్ లు రికార్డ్ చేశామని, సెక్యూరిటీలను దుర్వినియోగం చేయడానికి చేసిన మోసపూరిత ప్రణాళికలను ఈడీ వెలికితీసిందని తెలిపారు. పలు కంపెనీల ద్వారా నిధులు ఎలా తారుమారు అయ్యాయో గుర్తించామని, ఈ కేసులో ఎండీ పార్థసారథి , కృష్ణ హరి లను ప్రధాన కుట్ర దారులు గా గుర్తించామన్నారు. బ్యాంక్ లనుండి తీసుకున్న రుణాలు , ఇతర కంపెనీలకు ఎలా బదిలీ చేశారో ఇన్వెస్ట్ గేషన్ లో గుర్తిచామని, కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించామని, నిధులను దారి మళ్లించడానికి ఫైనాన్స్ కన్సల్టెంట్లు అలాగే పని చేయని NBFC లను ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు.