Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం.. కారణమిదే!
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం
- సమోసాలు, డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లోనే కాకుండా.. స్కూల్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలతో పాటు వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు తదితర ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడాన్ని నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లను పాఠశాల ప్రాంగణాల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి 50 మీటర్ల పరిధిలో కూడా వీటి ప్రకటనలను అనుమతించబోమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ముండే ఆదేశించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పాఠశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనల అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఎఫ్డీఏ తెలిపింది. పాఠశాల యాజమాన్యాలతో కలిసి జిల్లా, తాలూకా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను సజావుగా అమలు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!