Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం.. కారణమిదే!
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం
- సమోసాలు, డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లోనే కాకుండా.. స్కూల్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలతో పాటు వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు తదితర ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14, 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడాన్ని నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లను పాఠశాల ప్రాంగణాల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి 50 మీటర్ల పరిధిలో కూడా వీటి ప్రకటనలను అనుమతించబోమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ముండే ఆదేశించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పాఠశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనల అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఎఫ్డీఏ తెలిపింది. పాఠశాల యాజమాన్యాలతో కలిసి జిల్లా, తాలూకా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను సజావుగా అమలు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
ట్రెండింగ్
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!