Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం.. కారణమిదే!
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ముంబైలో ఫేమస్ వడాపావ్పై నిషేధం
- సమోసాలు, డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్క్రీమ్ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లోనే కాకుండా.. స్కూల్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలతో పాటు వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు తదితర ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడాన్ని నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వడాపావ్, సమోసాలు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లను పాఠశాల ప్రాంగణాల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి 50 మీటర్ల పరిధిలో కూడా వీటి ప్రకటనలను అనుమతించబోమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ముండే ఆదేశించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పాఠశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనల అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఎఫ్డీఏ తెలిపింది. పాఠశాల యాజమాన్యాలతో కలిసి జిల్లా, తాలూకా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను సజావుగా అమలు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!