Suspicious Death: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspicious Death: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే 16 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నారాయణ కాలేజీలో చేరింది. అయితే వంశిత ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంశిత రూమ్ మెంట్స్ తనను వెతుక్కుంటూ రావడంతో బిల్డింగ్ వద్ద శవమై కనిపించింది. దీంతో భాయాందోళన చెందిన కళాశాల విద్యార్థినులు అక్కడే ఉన్న వార్డెన్లు, ఉపాధ్యాయులకు తెలిపారు. కాగా విషయం తెసుకున్న కళాశాల యాజమాన్యం హుటూహుటిన వచ్చి చూడగా నిర్ఘాంతపోయారు. వంశిత మృతిపై వెంటనే బాచుపల్లి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. వంశిత భవనంపై నుంచి దూకిందా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యా..? వారం రోజుల క్రితం కాలేజీలో చేరిన వంశీతకు అక్కడి వాతావరణం నచ్చలేదా..? లేక చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయిందా..? అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
గాంధీ మార్చురీకి వంశిక కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దుబాయిలో ఉంటున్న వంశిక తండ్రి శాంతారావు, మార్చురీ వద్దకు తల్లి సుమలత ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. సుమలత, శాంతారావు దంపతులకు ఇద్దరు పిల్లలు బాబు, పాప ఉన్నారు. వంశిక పెద్దమ్మాయి. వంశిక చనిపోయిందన్న విషయం మాకు గాంధీ హాస్పిటల్ కి వచ్చే అంతవరకు కూడా తెలియదని వాపోయారు. కనీసం కాలేజీ వాళ్ళు వంశిక చనిపోయింది అన్న విషయాన్ని కూడా మాకు చెప్పలేదని ఆరోపించారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చి తెలుసుకొని ఆ తర్వాత మార్చురీ వద్దకు వస్తే అప్పుడు మాకు తెలిసింది వంశిక చనిపోయిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంశిక బాగా చదువుతుంది, టెన్త్ క్లాసులో 9.5% మార్కుల వచ్చాయని తెలిపారు. ఆమెకు హాస్టల్లో ఉండడం ఇష్టమే, అందుకే చేర్పించామని అన్నారు. ఆదివారం మాతో మాట్లాడింది, హాస్టల్ అంతా బానే ఉందని చెప్పిందని వంశిక తల్లి దండ్రులు తెలిపారు. మరి ఇంతలోనే ఏం జరిగిందో తెలియదని, తన బిడ్డ ఇలా శవంలా మాకు అప్పగిస్తారని ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. వంశిక మృతికి కారకులైన వారిని కఠిణంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
తాజావార్తలు
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!