Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ
Bandi Sanjay: జగిత్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ పాదయాత్ర 11వ రోజు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడి నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభమైంది. ఈ పాదయాత్ర సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగనుండగా.. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేయనున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈసందర్బంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. సారా దందాతో పాటు క్యాసినోలో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇక్కడ ఉపాధి లేపకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే.. గల్స్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Sajjala Ramakrishna Reddy : దింపుడు కళ్లెం ఆశతో జగన్పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారు
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సంతోషంగా ఉందని అన్నారు. ఫలితాల కోసం ప్రపంచం దృష్టంతా గుజరాత్ మీదే ఉందని తెలిపారు. అన్ని పార్టీలు ఒకటై మోడీ గారి ఇమేజ్ను బ్యాడ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఏమి అభివృద్ధి అని అన్నాడు స్పందన చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన మెజార్టీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం
తాజావార్తలు
-
Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!