Kishan Reddy: హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది..
- ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి..
- ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే ఛాన్స్..
- హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్, ముషీరాబాద్ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ విషయంలో హైలేవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేసి నగరాన్ని రక్షించాలని సీఎం రేవంత్ ను కోరుతున్నాను.. దురదృష్టవశాత్తు గత కొన్నిరోజులుగా క్రాంటాక్టర్లకు బిల్లులు రావడం లేదు.. మంజూరు అయిన పనులకు టెండర్లను పిలిస్తే క్రాంటాక్లర్లు ముందుకు రావడం లేదు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.. చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : రైలును బోల్తా కొట్టించే కుట్ర.. ట్రాక్ పై రాళ్లు, చెట్ల కొమ్మలు
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ఇక, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. లక్షా యాభై వేల కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు.. హైదరాబాద్ కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమే కానీ.. పేదవాళ్ల ఇండ్లను తొలగించకూడదని డిమాండ్ చేశారు. బస్తీలల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలి.. ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి.. పారిశ్రామిక రంగం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా ముందుకెళ్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!