Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయం..
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు..
- రాహుల్ గాంధీ నిర్ణయంతోనే ఈ బిల్లు సాధ్యమైంది..
- బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపి ఆమోదించేలా చూస్తాం: మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారత్ జోడో యాత్రలో దేశంలో ఉన్న అసమానతలు గుర్తించిన రాహుల్ గాంధీ ఎవరెంతో వారికంత అనే నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.. కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయింది అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ కులగణన చేసి ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాం.. ఒక సంవత్సరం తరువాత మార్చి 17వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసేందుకు కేంద్రానికి బిల్లును పంపి.. ఏకగ్రీవంగా ఆమోదించేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఇక, బీసీ మెదవుల ఆలోచనను అమలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలో పార్లమెంట్ లో అన్ని పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఆమోదంపై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం.. రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో పెట్టే బాధ్యతను మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి సాధించుకునే దిశగా వెళ్తామన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ సహకారంతో ఈ 42 శాతం సాధిస్తామని దృఢ విశ్వాసంతో ఇవాళ ఈ బిల్లు పాస్ చేసుకున్నాం.. ఈ బిల్లుకు సహకరించిన అందరికీ మరొక సారి ధన్యవాదాలు అని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!