PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ
- న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ భేటీ
- ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు
- ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు.
Read Also: Bulliraju : బుల్లిరాజు భారీ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతో తెలుసా..?
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదం గురించి
ఉగ్రవాదం గురించి తులసి గబ్బర్డ్ మాట్లాడుతూ.. భారతదేశం, బంగ్లాదేశ్, సిరియా, ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి” అన్నారు. ఉగ్రవాద ముప్పును ప్రతిఘటించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ ముప్పు యొక్క తీవ్రతను గుర్తిస్తూ, రెండు దేశాలు సమన్వయంగా దానిపై చర్యలు తీసుకుంటాయని గబ్బర్డ్ వెల్లడించారు.
ఖలిస్తానీ ఉగ్రవాదంపై చర్చ
ప్రధాని మోడీతో సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తులసి గబ్బర్డ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ “సిఖ్ ఫర్ జస్టిస్”, దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థపై.. అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.
చైనా సైన్యం దూకుడుపై చర్చ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైన్యం సైనిక దృఢత్వం పెరుగుతున్న నేపథ్యంలో చర్చలు జరిగాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తులసి గబ్బర్డ్ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా నిర్వహించిన భద్రతా సమావేశంలో తులసి గబ్బర్డ్, కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేనియల్ రోజర్స్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ పాల్గొన్నారు. ఈ క్లోజ్డ్ డోర్ సమావేశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఉగ్రవాదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వల్ల కలిగే భద్రతా ముప్పులను ఎదుర్కోవడానికి నిఘా సమాచారం భాగస్వామ్యం, పరస్పర సహకారంపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!