PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ
- న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ భేటీ
- ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు
- ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు.
Read Also: Bulliraju : బుల్లిరాజు భారీ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతో తెలుసా..?
Also Read
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
ఉగ్రవాదం గురించి
ఉగ్రవాదం గురించి తులసి గబ్బర్డ్ మాట్లాడుతూ.. భారతదేశం, బంగ్లాదేశ్, సిరియా, ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి” అన్నారు. ఉగ్రవాద ముప్పును ప్రతిఘటించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ ముప్పు యొక్క తీవ్రతను గుర్తిస్తూ, రెండు దేశాలు సమన్వయంగా దానిపై చర్యలు తీసుకుంటాయని గబ్బర్డ్ వెల్లడించారు.
ఖలిస్తానీ ఉగ్రవాదంపై చర్చ
ప్రధాని మోడీతో సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తులసి గబ్బర్డ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ “సిఖ్ ఫర్ జస్టిస్”, దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థపై.. అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.
చైనా సైన్యం దూకుడుపై చర్చ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైన్యం సైనిక దృఢత్వం పెరుగుతున్న నేపథ్యంలో చర్చలు జరిగాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తులసి గబ్బర్డ్ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా నిర్వహించిన భద్రతా సమావేశంలో తులసి గబ్బర్డ్, కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేనియల్ రోజర్స్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ పాల్గొన్నారు. ఈ క్లోజ్డ్ డోర్ సమావేశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఉగ్రవాదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వల్ల కలిగే భద్రతా ముప్పులను ఎదుర్కోవడానికి నిఘా సమాచారం భాగస్వామ్యం, పరస్పర సహకారంపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?