TG Weather: పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..
- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత..
- పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..
TG Weather: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 10.5 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 11.8 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిర్మల్ జిల్లా కుంటాలలో 12.6 డిగ్రీలు కాగా.. ఇక మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 13.1 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయింది. మిగతా జిల్లాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చలి గాలుల తీవ్రత పెరిగింది.
Read also: Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 12.2 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్లో 12.6 డిగ్రీలు, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో 13.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, సమీర్పేటలో 14.4 డిగ్రీలు, అత్యల్పంగా 12.2 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 12.2, వికార్బాద్లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యల్పంగా నమోదైంది. ఇక రాజధాని నగరం హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో మార్నింగ్ వాకింగ్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముంచింగిపుట్టులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న చలి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లాలని చెబుతున్నారు.
RGV: ముంచుకొస్తున్న పోలీసుల డెడ్లైన్..! ఆర్జీవీ ఏం చేస్తారు..?
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!